హనుమకొండ, ఆగస్టు 7: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులపాటు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ వేడుకలను అంబరాన్ని తాకేలా నిర్వహించాలని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వజ్రోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఆదివారం హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నందున ప్రతి ఒకరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.
సోమవారం నుంచి 22వ తేదీ వరకు 15 రోజులపాటు పండుగ వాతావరణంలో వేడుకలు చేపట్టాలన్నారు. ఇందుకుగాను పార్టీలకతీతంగా దేశభక్తిని చాటేలా కార్యక్రమాల రూపకల్పన చేశామని తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులు, కళాకారులను ఎంపిక చేయాలని సూచించారు. కవి సమ్మేళనాలు, ఊరూరా క్రీడా స్ఫూర్తి నెలకొల్పుతూ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తూ ఫ్రీడం రన్ నిర్వహించాలని చెప్పారు. స్వతంత్ర వజ్రోత్సవాలను పురసరించుకొని 57 ఏండ్లు నిండిన ప్రతి ఒకరికి పింఛన్ మంజూరు చేస్తున్నామని, డయాలసిస్ పేషెంట్లకూ ఆసరా పింఛన్లు ఇవ్వనున్నట్టు ఆయన పేర్కొన్నారు. వన మహోత్సవాల్లో భాగంగా మొకలను విరివిగా నాటాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, జడ్పీ చైర్మన్లు డాక్టర్ సుధీర్కుమార్, గండ్ర జ్యోతి, పాగాల సంపత్రెడ్డి, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, వరంగల్, జనగామ కలెక్టర్లు గోపి, శివలింగయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.