దేశంలో పెరుగనున్న భూతాపం
కొండాపూర్, మార్చి 21: ఆర్కిటిక్ వార్మింగ్తో దేశంలో భూతాపం విపరీతంగా పెరిగి ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం అధికంగా ఉన్నదని ‘లార్జ్ స్కేల్ కనెక్షన్ టూ డెడ్లీ ఇండియన్ హీట్వేవ్స్’ ఆర్టికల్లో ఇండియా, బ్రెజిల్ పరిశోధకులు పేర్కొన్నారు. దేశంలో ఏప్రిల్, మే నెలలో హీట్వేవ్ అధికమై వేడి వాతావరణం, అధిక తేమ ప్రాణహానికి కారణమవుతుందని తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి విపత్తులు సంభవిస్తాయని, 1998 నుంచి 2017 మధ్యకాలంలో తీవ్రమైన ఉష్ణ తరంగాల కారణంగా 1.6 లక్షల మందికిపైగా మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అత్యధిక ఉష్ణోగ్రతలతో పెను ప్రమాదం తలెత్తనున్నట్టు పేర్కొన్నారు. ఈ పరిశోధనలు చేసినవారిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ డాక్టర్ వీబీ రావు, డాక్టర్ కే కోటేశ్వరరావు, డాక్టర్ బీ మహేంద్రనాథ్, డాక్టర్ టీవీ లక్ష్మీకుమార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి గోవర్ధన్ దండు ఉన్నారు.