మహబూబ్ నగర్ : పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మహబూబ్నగర్ తెలంగాణ చౌరస్తా వద్ద గురువారం మంత్రి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి నల్లదుస్తులు ధరించి కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బీజేపీకి హటావో దేశ్ కి బచావో అంటూ నినాదాలు చేశారు. మహిళలతో కలిసి ధర్నా లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింలు, ముడా చైర్మన్ వెంకన్న ముదిరాజ్, జిల్లా రైతు బంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్, గొర్రెల సహకార సంఘం అధ్యక్షుడు శంతన్న యాదవ్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు రెహమాన్ పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.