హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన కనీస వేతనాల ప్రకారం కేజీబీవీ, నాన్ టీచింగ్, వరర్లకు వేతనాలు పెంచాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వరర్స్ యూనియన్ (టీయూసీఐ)రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ఎల్ పద్మ, ఎం సుధాకర్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం మహాత్మ జ్యోతిబాపూలే ప్రజాభవన్ ఇన్చార్జి చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఇటీవలే మూడు జోన్లుగా కనీస వేతనాలు ప్రకటించారని పేర్కొన్నారు. ఈ కనీస వేతనాలు కూడా కేజీబీవీ నాన్ టీచింగ్ వరర్లకు అందడంలేదని వివరించారు. వినతిపత్రం ఇచ్చినవారిలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుణ, పుష్పలత, సహాయ కార్యదర్శి వీరమని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.