హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను ప్రభుత్వం పెంచింది. మేయర్, డిఫ్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, వార్డు మెంబర్ల వేతనాలను 30 శాతం పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన వేతనాలు ఈ ఏడాది జూన్ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.