హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఉపాధి హామీ కూలీలు, వారి పిల్లలు, కుటుంబసభ్యులు పనిప్రదేశాల్లో మరణించినా, గాయపడి అంగవైకల్యానికి గురైనా.. వారికి ఇచ్చే పరిహారాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా మంగళవారం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు చెల్లిస్తున్న పరిహారాన్ని 2006లో నిర్ణయించారు. ఉపాధి హామీ కూలీ, వారి కుటుంబ సభ్యులు, పిల్లలు పరిహారం నిబంధనల పరిధిలోకి వస్తారు.