కాచిగూడ, ఏప్రిల్ 1: బీసీల బడ్జెట్ను రూ.2 లక్షల కోట్లకు పెంచి, పూర్తి రీయింబర్స్మెంట్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. శుక్రవారం ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్కు వినతిపత్రం అందజేసింది. ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరింది. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి చట్ట బద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. బడ్జెట్లో కేవలం రూ.1400 కోట్లు ఇచ్చి 56శాతం ఉన్న బీసీలను మోదీ ప్రభుత్వం మోసం చేసిందని కృష్ణయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, జబ్బల శ్రీనివాస్, మోక్షిత్ పాల్గొన్నారు.