Income Tax Inspector | హైదరాబాద్ : కవాడిగూడలోని సీజీవో టవర్స్పై నుంచి దూకి ఓ అధికారిని ఆత్మహత్య చేసుకున్నారు. గాంధీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సీజీవో టవర్స్లో ఉదయం 11:15 సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సీజీవో టవర్స్ సిబ్బంది గాంధీనగర్ పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో కలిసి వివరాలు సేకరించారు. ఆదాయ పన్ను శాఖ అధికారి విజయలక్ష్మి(52) సీజీవో టవర్స్పై నుంచి దూకడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది.