హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘ప్రదుషన్ సే ఆజాదీ’ (కాలుష్యం నుంచి విముక్తి) నినాదంతో ఆదాయపన్ను శాఖ శనివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో కలిపి ఐదువేల మొక్కలు నాటినట్టు ఉభయ రాష్ర్టాల ఆదాయపన్నుశాఖ చీఫ్ కమిషనర్ అతుల్ప్రణయ్ తెలిపారు. బంజారాహిల్స్లో నిర్వహించిన కార్యక్రమంలో వనజీవి రామ య్య, పర్యావరణవేత్త ఎం విజయరామ్కుమార్ను సన్మానించారు. దూలపల్లి రిజర్వ్ఫారెస్ట్లో ఆదాయపన్నుశాఖ డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) వసుంధరసిన్హా నేతృత్వంలో 700 మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ అక్బర్ పాల్గొన్నారు.