Telangana
- Dec 28, 2020 , 08:31:41
పెరుగుతున్న వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల రాబడి

హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల రాబడి క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటివరకు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.590 కోట్ల ఆదాయం సమకూరింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే 17 వేలకుపైగా లావాదేవీలు జరిగాయి. ఈనెల 21 నుంచి వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాత విధానంలోనే జరుగుతున్నాయి. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనావేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అందులో 24 శాతం మాత్రమే రాబడి నమోదయ్యింది. రిజిస్ట్రేషన్ల నిలిపివేతకు ముందు 4,80,474 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ధరణి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు 66,614, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు 19,620 జరిగినట్లు తెలిపారు.
తాజావార్తలు
- సీడీకె గ్లోబల్ వర్ట్యువల్ కన్వర్జెన్స్ -2021
- కరోనా క్రైసిస్ ఉన్నా.. స్టార్టప్లు భేష్!!
- బంద్ కానున్న గూగుల్ డ్యుయో సేవలు..?
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిక
MOST READ
TRENDING