హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): కానిస్టేబుల్ కొలువుల ఎంపిక ప్రక్రియలో దేహదారుఢ్య పరీక్షలను తమకు ప్రత్యేకంగా నిర్వహించాలని డీజీపీ మహేందర్రెడ్డికి ట్రాన్స్జెండర్లు విజ్ఞప్తిచేశారు. తెలంగాణ హిజ్రా అండ్ ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదుగురు ట్రాన్స్జెండర్లు శుక్రవారం డీజీపీ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… ఐదుగురు ట్రాన్స్జెండర్లు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ నుంచి దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించినట్టు తెలిపారు. ఈవెంట్స్లో ఎంపిక ప్రమాణాలు సరిగా లేవని, పురుషులు, మహిళలతో పోటీపడలేమని పేర్కొన్నారు.