హైదరాబాద్, డిసెంబర్ 27, (నమస్తే తెలంగాణ): జనాభా గణనలో కులగణన చేయాల్సిందిగా కేంద్రానికి సిఫారసు చేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ జాతీయ బీసీ కమిషన్ (ఎన్సీబీసీ)కి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో ఎన్సీబీసీ చైర్మన్ భగవాన్లాల్ షైనీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర బీసీ జాబితాలో ఉన్న కులాలన్నింటినీ కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరారు. ఈ సందర్భంగా ఓబీసీ జాబితాలోలేని 37 బీసీ కులాల సమగ్ర వివరాలను ఎన్సీబీసీ చైర్మన్కు అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ జాబితాలో చేర్చిన 10 కులాలు, బీసీ-ఈ క్యాటగిరీకి చెందిన 12 కులాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేర్చిన 18 కులాలు కలిపి మొత్తంగా 40 కులాలను కేంద్ర జాబితాలో చేర్చాలని కోరారు.