హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయంలో విద్యుత్తు సరఫరా కోసం ఏర్పాటుచేసిన 11 కేవీ సామర్థ్యం గల సబ్స్టేషన్ను ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం ప్రారంభించారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత నూతన భవనానికి విద్యుత్తు సరఫరాను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సచివాలయ భవనం తుది మెరుగులు దిద్దుకుంటుండగా, ఈ నెల 17న దానిని ముఖ్యమంత్రి కే కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు.