బోధన్, డిసెంబర్ 7: రాష్ట్రంలో మరో కొత్త మండలం మనుగడలోకి రానున్నది. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సాలూరా మండల తాసిల్దార్ కార్యాలయాన్ని ఈ నెల 9న ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ కోసం ఎమ్మెల్యే షకీల్ బుధవారం స్థల పరిశీలన చేశారు.