హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): న్యాయ సలహా కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్రావు పిలుపునిచ్చారు. నాంపల్లి ఎగ్జిబిషన్లో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ సేవా కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ప్రజలు తమకు రాజ్యాంగం కల్పించిన న్యాయపరమైన హకులను తెలుసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి గోవర్ధన్రెడ్డి, పరిపాలనాధికారి ఏ రాధిక, మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాధిక జైస్వాల్, జడ్జి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.