యాదగిరిగుట్టలో సుదర్శన నారసింహహోమం అత్యంత వైభవంగా సాగింది. గురువారం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో నారసింహ హవనం చేస్తూ నిత్య సుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి నిత్య తిరు కల్యాణో మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించారు. కాగా స్వామివారిని 7,500 మంది భక్తులు దర్శించుకొన్నారు. ఖజానాకు రూ.13,73,403 ఆదా యం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.