హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తె లంగాణ): రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యటన నేపథ్యంలో అధికారులు ఎన్నికల వివరాలతో సిద్ధంగా ఉండాలని సీఎ స్ శాంతికుమారి ఆదేశించారు. అక్టోబరు 3 నుంచి మూడురోజులపాటు ఈసీ అధికారుల రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్తోపాటు సభ్యులు హైదరాబాద్లో పర్యటిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతోపాటు ఉన్నధికారులతో సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. ఎన్నికల అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, డీజీపీ అంజనీకుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీనియర్ పోలీస్ అధికారులు, యూనిట్ అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో మాట్లాడి పలు అంశాలపై వివరణ తీసుకున్నారు.