HomeTelanganaIn The Upsc 2023 24 Results Vanaparthi District Syed Qasim Has Ranked 278th
ఆత్మకూరువాసికి 278వ ర్యాంకు
యూపీఎస్సీ 2023-24 ఫలితాల్లో వనపర్తి జిల్లా ఆత్మకూరువాసికి 278వ ర్యాంకు వరించింది. ఆత్మకూరు పట్టణానికి చెందిన సయ్యద్ ఖాసీమ్ (రిటైర్డ్ ఉపాధ్యాయుడు) మనుమరాలు ఎహెతదా ముఫాసిర్ 278 ర్యాంకు సాధించింది.
ఆత్మకూరు, ఏప్రిల్ 16: యూపీఎస్సీ 2023-24 ఫలితాల్లో వనపర్తి జిల్లా ఆత్మకూరువాసికి 278వ ర్యాంకు వరించింది. ఆత్మకూరు పట్టణానికి చెందిన సయ్యద్ ఖాసీమ్ (రిటైర్డ్ ఉపాధ్యాయుడు) మనుమరాలు ఎహెతదా ముఫాసిర్ 278 ర్యాంకు సాధించింది. మహబూబ్నగర్లో స్థిరపడిన సయ్యద్ ఇబ్రహీంఖలీల్ రెండో కూతురు ఎహెతదా ముఫాసిర్ చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో చదివింది.
ఇంటర్ బైపీసీలో 987 మార్కులు సాధించి టాపర్గా నిలిచి.. వైద్యవిద్యకు వెళ్లకుండా డిగ్రీ చదివింది. ఢిల్లీ యూనివర్సిటీ శ్రీరామ్ మహిళా కళాశాలలో పొలిటికల్ సైన్స్ చదివింది. ఎలాంటి కోచింగ్ లేకుండా తండ్రి సూచనలతో ఇంట్లోనే ప్రిపేర్ అయ్యింది. తాత బోధించిన విజ్ఞాన బోధనలు, కరెంట్ అఫైర్స్, పుస్తకాలను నిత్యం చదవడం వల్లే ఈ లక్ష్యాన్ని సాధించగలిగినట్టు ఎహెతదా ముఫాసిర్ చెప్పారు.