నల్లగొండ : సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కందుకూరు గ్రామానికి చెందిన 60కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి గులాబీ కండువాలను కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు. రైతులకు నిరంతరం కరెంట్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు.
నియోజకవర్గంలో లక్ష 60వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం అని ఆయన తెలిపారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో రూ.100 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం పొంది మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును అందజేస్తున్నామని అన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర్ రావు, రైతుబంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, యువజన విభాగం మండల అధ్యక్షుడు మాల్ రెడ్డి విష్ణువర్దన్ రెడ్డి, నేనావత్ రాంబాబు, బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, డొడ్డుపల్లి సంజీవ, ఉపుగంటి అంజల్ రావు, సూరి, వేముల రాజు, బోడ్డుపల్లి కృష్ణ, విష్ణు, వాడిత్య బాలు పాల్గొన్నారు.