హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): గుడిమల్కాపూర్లోని కింగ్స్ ప్యాలెస్లో ప్రాసిక్యూషన్స్ విభాగం డైరెక్టర్ జీ వైజయంతి సమక్షంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసేన్రెడ్డితోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 400 మందికిపైగా ప్రాసిక్యూటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ విభాగం పని తీరు, భవిష్యత్ లక్ష్యాలపై సమీక్షించారు. 2022లో ఉత్తమ సేవలందించి, అత్యధిక కేసుల్లో శిక్షలు పడేందుకు కృషి చేసిన ప్రాసిక్యూటింగ్ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.. అనంతరం నూతన క్యాలెండర్ను ముఖ్యఅతిథులు ఆవిష్కరించారు. కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆక్టుకున్నాయి.