హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): టెట్ క్వాలిఫై అయిన ఇన్ సర్వీస్ టీచర్లు తమకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వినతిపత్రం సమర్పించారు.
1996 డీఎస్సీ నుంచి ఇప్పటివరకు అనేక మంది టీచర్లు టెట్ క్వాలిఫై అయ్యారని, వీరిని పదోన్నతులు కల్పించాలని కే రవి, ఎం పరశురాములు తదితరులు కోరారు.