ఆత్మకూరు, సెప్టెంబర్ 1: హనుమకొండ జిల్లా పరకాలలో కాంగ్రెస్ వర్గీయులు రెండుగా చీలిపోయి పరస్పరం దుర్భాషలాడుకున్నారు. పార్టీ అబ్జర్వర్ సాక్షిగా కొండా మురళి, ఇనగాల వెంకట్రాంరెడ్డి వర్గీయులు బాహాబాహీకి దిగారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్లో పరకాల నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో కొండా మురళీధర్రావు, ఇనగాల వెంకట్రామిరెడ్డి వర్గీయులు కలిసి నినాదాలు చేసుకుంటూ స్టేజిపైకి రావడంతో తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్టేజిపై ఉన్న ఏఐసీసీ అబ్జర్వర్, వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి రవీంద్ర ఉత్తమ్రావు ముందే కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అక్కడ నుంచి కొండా వర్గీయులు స్టేజి పైనుంచి బయటకు వచ్చారు. ‘ఇది నా అడ్డా’ అంటూ.. కొండా మురళీధర్రావు మీసం తిప్పగా.., ‘ఇది నా అడ్డా’.. అంటూ ఇనగాల మీసం తిప్పుతూ, తొడ కొట్టారు. గ్రూపు తగాదాలతో నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.