సమైక్య రాష్ట్రంలో అడుగడుగునా సంక్షోభం ఎదుర్కొన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అదే స్వరాష్ట్రంలో గడపగడపకు సంక్షేమం అందుతోందని .. ప్రతి కుటుంబంలో వెలకట్టలేని సంతోషం వెల్లివిరస్తోందని అన్నారు. ఇవాళ తెలంగాణలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని.. లబ్ధిదారుడు లేని కుటుంబం లేదని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ నలుమూలలా సంక్షేమ సంబురాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఒక్క సంక్షేమ రంగానికే ఏటా 50 వేల కోట్లకు పైగా నిధులు చరిత్రలో ఏ పాలకుడు చేయని సాహసమిది అని అన్నారు. ఆలోచనకు కూడా అందని భారీ మొత్తమిది అని అన్నారు. దేశ సంక్షేమ రంగం చరిత్రలోనే సరికొత్త అధ్యాయమిది అని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో అందుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలను ట్విట్టర్లో పెట్టారు.
సమైక్యరాష్ట్రంలో అడుగడుగునా సంక్షోభం
స్వరాష్ట్రంలో గడపగడపకు సంక్షేమం
ప్రతి కుటుంబంలో వెలకట్టలేని సంతోషంతెలంగాణ తొమ్మిదేళ్ల సంక్షేమ పథం
యావత్ దేశానికే సరికొత్త సందేశంఇవాళ తెలంగాణలో…
సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు
లబ్దిదారుడు లేని కుటుంబం లేదుదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా… pic.twitter.com/CqG2eH0fV5
— KTR (@KTRBRS) June 9, 2023
ఆసరా: కనీస జీవన భద్రత కల్పిస్తూ రాష్ట్రంలోని 44,12,882 మందికి ఆసరా పెన్షన్లు అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
రైతు బంధు: రైతుకున్న పెట్టుబడి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వినూత్నమైన నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి సైతం కొనియాడింది. ఎకరానికి సాలుకు పదివేల రూపాయల సాయం!
రైతు బీమా: రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 రోజుల్లోగా 5 లక్షల రూపాయల బీమా అందించి ఆ కుటుంబానికి అండగా నిలుస్తోంది ప్రభుత్వం.
కేసీఆర్ కిట్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన పేదింటి మహిళలకు ఆర్థిక సాయంతో పాటు కనీస అవసరాలు తీర్చే మానవతా దృక్పథమైన ఆలోచన కేసీఆర్ కిట్.
కళ్యాణలక్ష్మీ/షాదీ ముబారక్: పేదింటి యువతుల వివాహం ఆ కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశ్యంతో లక్షకు పైగా ఆర్థిక సాయం అందిస్తున్నారు.
దళిత బంధు: దళితులను స్వయం సమృద్ధులుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు పది లక్షల రూపాయల వరకూ ఆర్థిక సాయాన్ని ఉచితంగా అందిస్తుందీ ప్రభుత్వం.
కంటివెలుగు: కంటిచూపు సమస్యతో బాధపడే వారికి ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించి అవసరం మేర కళ్లద్దాలు అందించి సాయం చేస్తున్నారు.
సన్నబియ్యం: తెలంగాణలోని విద్యాలయాల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతుండటం దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
గురుకులాలు: రాష్ట్రంలో కొత్తగా గురుకులాలు ఏర్పాటుచేసి భోజనం సదుపాయంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థులను తీర్చిదిద్దుతోంది సీఎం కేసీఆర్ ప్రభుత్వం.
ఓవర్సీస్ స్కాలర్షిప్: దళిత, గిరిజన, బిసి, ఈబిసి విద్యార్థులు విదేశీ ఉన్నత విద్యను అభ్యసించేందుకు రూ.5 లక్షల వరకూ ఆర్థిక సాయం అందిస్తున్నారు.
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్: ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవానంతరం న్యూట్రిషన్ కిట్లు అందుకుని రక్తహీనత లాంటి ప్రధాన సమస్యను అధిగమిస్తున్నారు తెలంగాణ తల్లులు.
బీసీలకు లక్ష: కుల వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న బీసీ కుటుంబాలకు ముడిసరుకు కొనుగోలు, పనిముట్ల కొనుగోలు కోసం ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం