TG Weather | తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదుగాలులతో రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది.
అలాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలుపడే సూచనలున్నాయని చెప్పింది. అదే సమయంలో రాగల మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయని వివరించింది. గడిచిన 24గంటల్లో వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది.