హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఐకేపీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (వీవోఏ) తమ సమస్యల పరిషారం కోసం మరోసారి పోరాట బాట పట్టారు. ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు వీవోఏల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. సోమవారం గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) సీఈవో దివ్యాదేవరాజన్కు సమ్మె నోటీసును అందజేశారు. సోమవారం నిర్వహించిన తమ రాష్ట్ర కమిటీ సమావేశంలో వీవోఏల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సభ్యులు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిషరించకపోవడంతో, శాంతియుత పద్ధతిలో విధులను బహిషరించి నిరవధిక సమ్మె చేయాలని జేఏసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.
వీవోఏల సమస్యల పరిషారానికై జేఏసీ ప్రధానంగా ఆరు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టింది. ‘వీవోఏల కనీస వేతనాన్ని రూ.20 వేలకు పెంచాలి. వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, హెచ్ఆర్ పాలసీని వర్తింపజేయాలి. అర్హులైన వీవోఏలకు సీసీలుగా ఉద్యోగోన్నతి కల్పించాలి. వీవోఏలకు రూ.10 లక్షల ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. విధి నిర్వహణ కోసం ట్యాబ్ల సౌకర్యం కల్పించాలి. వయోపరిమితికి సంబంధించిన జీవో నంబర్ 58ని సవరించాలి’ అని కోరింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలను పరిషరించాలని, లేనిపక్షంలో మే 18 నుంచి సమ్మె తప్పదని వారు హెచ్చరించారు. రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు నాగుల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి కేతావత్ శరత్కుమార్, వరింగ్ ప్రెసిడెంట్ ఇర్ప పవన్, కోశాధికారి గజెల్లి భీమేశ్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.