ఆదిలాబాద్ : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టులో మంత్రి ఆదివారం చేపపిల్లలను వదిలారు. మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలను సరఫరా చేయడంతోపాటు మార్కెటింగ్ కోసం ప్రభుత్వం వాహనాలను అందజేస్తుందని తెలిపారు.
ప్రభుత్వ పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.