సంగారెడ్డి, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ): వర్షపాతాన్ని కచ్చితంగా లెక్కించడంతోపాటు పర్యావరణం, వాతావరణంలో మార్పులను అంచనా వేయడానికి రెయిన్ డ్రాప్ రిసెర్చ్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్ అన్నా రు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ప్రపంచస్థాయి రెయిన్ డ్రాప్ రిసెర్చ్ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించి, మాట్లాడారు. వర్షపు చినుకుల నిర్మాణ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఈ రిసెర్చ్ సెంటర్ ఉపకరిస్తుందని చెప్పారు. ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. రెయిన్ డ్రాప్ డైనమిక్స్ను అంచనా వేసే మొదటి ర కం రిసెర్చ్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేశామని తెలిపారు. వర్షపాతాన్ని మరింత కచ్చితత్వం తో అంచనా వేయవచ్చని, ఇది దేశం మొత్తానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రొఫెసర్ కీర్తిసాహు మాట్లాడుతూ.. వివిధ ఎత్తుల్లో వర్షం చినుకుల ఆకారం, పరిమాణాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చని అన్నారు. ఇందుకోసం డిజిటల్ ఇన్లైన్ హోలోగ్రఫీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న టెక్నాలజీ కంటే ప్రస్తుతం ఇక్కడ ఉపయోగిస్తున్న టెక్నాలజీ అత్యంత మెరుగైనదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లు లక్ష్మణ దొర, విద్యాసాగర్, ఐఐటీయన్లు పాల్గొన్నారు.