KTR | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ మద్రాస్లో జరుగనున్న ఈ- సమ్మిట్లో ప్రసంగించాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు ఆహ్వానం అందింది. ప్రతి ఏటా నిర్వహించే ఆంత్రప్రెన్యురల్ ఫెస్టివల్ (ఈ-సమ్మిట్)లో కీలకోపన్యాసం చేయాలని ఐఐటి మద్రాస్ కేటీఆర్ను కోరింది ఈ- సమ్మిట్కు దేశ, విదేశాల నుంచి పారిశ్రామిక రంగంలో కీలకమైన వ్యక్తులను, సంస్థల అధిపతులను, విధాన నిర్ణేతలను ఐఐటీ మద్రాస్ ఆహ్వానిస్తుంది.
కేటీఆర్కు ఉన్న అపారమైన అనుభవం నేపథ్యంలో భవిష్యత్తు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేయాల్సిందిగా కేటీఆర్కు పంపిన ఆహ్వానంలో ఐఐటీ మద్రాస్ కోరింది. శనివారం నుంచి రెండు రోజులపాటు ఈ సదస్సు జరుగనున్నది.