సంగారెడ్డి, జూన్ 6(నమస్తే తెలంగాణ) : విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఐఐటీ హైదరాబాద్.. గ్రీన్కో గ్రూపుతో కలిసి బోల్డ్ అండ్ యూనిక్ ఐడియాస్ లీడింగ్ టు డెవలప్మెంట్(బిల్డ్) కార్యక్రమాన్ని రూపొందించింది. దీనిని సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఐఐటీహెచ్లో ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్, ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి, గ్రీన్కో గ్రూపు ఎండీ, సీఈవో డాక్టర్ అనిల్ చలమలశెట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్న విద్యార్థులు స్టార్టప్లు ప్రారంభించే అవకాశాన్ని ఐఐటీహెచ్, గ్రీన్కో గ్రూపు కల్పించాయని చెప్పారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాయని, ఆవిష్కర్తలకు రూ.లక్ష వరకు ఆర్థిక సహాయం అందజేస్తాయని తెలిపారు. కొత్త ఆవిష్కరణలతో ముం దుకొచ్చిన విద్యార్థులకు మెంటార్షిప్, వర్క్స్పేస్, కో వర్కింగ్ సపోర్టు, ప్రోటో టైప్ సపోర్ట్ అందజేయనున్నట్టు వివరించారు. బిల్డ్ ప్రోగ్రామ్లో చేరాలనుకునే విద్యార్థులు https:itic. ac.in/build సైట్లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.