Congress | న్యూఢిల్లీ, జూలై 12 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రకటన ఉండబోదని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఎమ్మెల్యేల అభిప్రాయాల ఆధారంగానే సీఎం అభ్యర్థి ఎంపిక ఉంటుందని తేల్చిచెప్పారు. ఢి
ల్లీలోని మహారాష్ట్ర సదన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థులకు కొదవలేదని అన్నారు. రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్, భట్టి విక్రమార్క, మధుయాష్కీ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్కలాంటి ఎంతో మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వేగంగా బలం పుంజుకొంటున్నదని చెప్పారు.