సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. పంట పొలాలను, పండ్ల తోటలను దెబ్బతీస్తున్నాయి. అన్నారం గ్రామానికి చెందిన రైతు దొంగరి వెంకట్రామ్ తన పంటను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఓ పెద్దపులి బొమ్మను కొనుగోలు చేశారు. కోతుల గుంపు రాగానే తన పాలేరు ద్వారా ఆ పులిబొమ్మను తోటలో తిప్పుతున్నారు. ఇలా చేయడంతో కోతులు పరారవుతున్నట్టు ఆ రైతు పేర్కొన్నారు. – తుంగతుర్తి,