హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): పర్యావరణానికి హాని కలిగిస్తున్న వ్యవసాయ వ్యర్థాలను నియంత్రించేందుకు ఇక్రిశాట్ నడుం బిగించింది. పంట కోతల తర్వాత పొలంలో మిగిలిపోయే ఈ వ్యర్థాలను ప్రత్యేక పద్ధతిలో ప్రాసెస్ చేసి, తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువులను తయారు చేసేందుకు శాస్త్రీయ విధానాన్ని రూపొందిస్తున్నది.
పర్యావరణంపై గ్రీన్హౌస్ వాయువుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఇక్రిశాట్ ఇప్పటికే ‘బయోచార్’ విధానాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. పంట వ్యర్థాలతో సేంద్రీయ ఎరువులను తయారు చేసే విధానం కూడా ‘బయోచార్’ మాదిరిగానే ఉంటుందని, ఈ విధానంతో రైతులకు ఎరువుల ఖర్చులతోపాటు కాలుష్య ఉద్గారాలు తగ్గుతాయని పరిశోధకులు చెప్తున్నారు.