హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు కష్టపడితేనే కలలు సాకారం అవుతాయని, ఇష్టంతో చదివితే ఉత్తమస్థానంలో ఉంటారని హైదరాబాద్ ఐసీబీఎం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ డైరెక్టర్ డాక్టర్ జరార్ అన్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. విజయానికి షార్ట్కట్లు ఉండవని, లక్ష్యాన్ని సాధించాలనే తపన ఉంటే చాలని సూచించారు. భవిష్యత్తులో ఎదగడానికి, కొత్త ఆలోచనలను వెలిబుచ్చేందుకు ఎప్పుడూ వెనకాడకూడదని ఉద్బోధించారు. సెమినార్లో కళాశాల డీన్ డాక్టర్ ఎంవీ రామారావు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్రావు, పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్జే రెడ్డి, అధ్యాపకులు, సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.