మెదక్: జిల్లా నూతన కలెక్టర్గా రాజర్షి షా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు రాజర్షి షా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్.. కలెక్టర్ రాజర్షిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఢీఓ సాయిరాం, డీపీఓ సాయిబాబ, సీపీఓ కాసీం, డిఎంఅండ్హెచ్ఓ చందు నాయక్, పశుసంవర్ధక శాఖ అధికారి విజయ శేఖర్ రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారి కృష్ణమూర్తి, డీఎస్ఓ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి ఆశాకుమారి, డిఎస్డిఓ విజయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ అధికారి బ్రహ్మాజీ, మెప్మా పీడీ ఇందిర, బీసీ సంక్షేమ అధికారి కేశురాం, డిపిఆర్ఓ శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.