 
                                                            Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీలు అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్లాగ్షిప్ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక సీఎస్గా సవ్యసాచి ఘోష్ బదిలీ అయ్యారు. సంక్షేమ శాఖ ప్రత్యేక సీఎస్గానూ కొనసాగనున్నారు ఘోష్. గిరిజన సంక్షేమ కార్యదర్శి, కమిషనర్గా అనితా రామచంద్రన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రవాణా శాఖ కమిషనర్గా ఇలంబర్తి బదిలీ కాగా, పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఎస్ రామకృష్ణారావు వద్దే మెట్రో పాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శి బాధ్యతలు ఉంచుకున్నారు. జీఏడీ కార్యదర్శిగా ఇ శ్రీధర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. టీజీ ఆయిల్ఫెడ్ ఎండీగా యాస్మిన్ బాషాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్సీ అభివృద్ధి కమిషనర్గా జి జితేందర్ రెడ్డి బదిలీ కాగా, ఎస్సీ సహకార సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
 
                            