Telangana | హైదరాబాద్ : తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ బదిలీ అయ్యారు. ప్రశాంత్ జీవన్ పాటిల్ను నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. సిద్దిపేట కలెక్టర్గా మిక్కిలినేని మను చౌదరి నియామకం అయ్యారు. జనగామ కలెక్టర్గా రిజ్వాన్ బాషా షేక్ నియామకం అయ్యారు. జనగామ కలెక్టర్ శివలింగయ్యను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు.