మహబూబ్నగర్ : వీళ్ల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.. ఇక్కడ చిన్న చిన్న రేకులు, తడకలతో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. కాళ్లు లేనివారు, రెండు కళ్లులేనివారు ఫించన్ డబ్బులతో బతుకులు వెళ్లదీస్తున్నారు. గాలొస్తే ఎగిరిపోయే గుడిసెలను కూడా అర్ధరాత్రి వందలాది పోలీసు బందోబస్తుతో బుల్డోజర్లను పెట్టి కూల్చేశారు(HYDRAA) అధికారులు. పాపం ఆ కళ్ళు లేని కబోదులు మీ కాళ్లు మొక్తం సారు మమ్మల్ని రోడ్డున పడేయకండి.. మా నీడను కూల్చేయకండి అంటూ విలపిస్తున్నా కనికరం లేకుండా కూల్చేశారు.
మహబూబ్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్ పల్లి సమీపంలో ఎక్కువశాతం మంది కుంటివారు, గుడ్డివారు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో అందరూ కళ్లులేనివారే. ప్రభుత్వం ఇచ్చే ఫించన్ డబ్బులే వారికి ఆసరా. ఈ ఇండ్లు ఇప్పటివి కావు. 15 సంవత్సరాల నుంచి నిరుపేదలు ఇక్కడ అవాసం ఏర్పాటు చేసుకుని కలో గంజో తాగి బతుకున్నారు.
ఈ పేదల పరిస్థితి చూసి గత టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ రోడ్లు, మిషన్ భగీరథ నీళ్లు, కరెంటు మంజూరు చేసింది. ఇండ్లకు పట్టాలు కూడా ఇచ్చింది. గృహలక్ష్మి పథకం కింద పక్కా ఇండ్లు కూడా కట్టిస్తమని చెప్పింది. ఇప్పడు రేవంత్ ప్రభుత్వం ఉన్న నీడను కూల్చేసిందని, వికాలంగులైన తమకు దిక్కెవరని బోరుమంటున్నారు. తాము బంజార హిల్స్లో కోటీశ్వరులం కాదు… వాళ్లకేమో నోటీసులు ఇస్తరు…వాళ్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటరు… మాకేందుకు ఈ అన్యాయము… ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.. ఇదేనా ప్రజాపాలన అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇళ్లను కూల్చేసిన అనంతరం దిక్కుతోచని స్థితిలో ఉన్న పేదలు.. వీడియో
నిన్న అర్ధరాత్రి మహబూబ్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్ పల్లి సమీపంలో
ఇళ్లను కూల్చిన ఘటనలో బాధితులు ఎక్కువ మంది వికలాంగులు, దళితులు, పేదలు ఉండడం బాధాకరం.బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు, మిషన్ భగీరథ పైప్ లైన్లు మరియు ఇతర సౌకర్యాలు కల్పించడం జరిగింది. pic.twitter.com/pDouccvTdk
— V Srinivas Goud (@VSrinivasGoud) August 29, 2024
— V Srinivas Goud (@VSrinivasGoud) August 29, 2024
Dear Kharge Ji,
As you said, demolishing someone’s home and rendering their family homeless is both inhumane and unjust
This is exactly what is happening in Telangana with utter contempt for law & judiciary. Below is a video of Mahbubnagar town where 75 houses of poor have been… https://t.co/HlneWWBVlj pic.twitter.com/8qJJeeDQ45
— KTR (@KTRBRS) August 30, 2024
15 సంవత్సరాలుగా ఇంటి పన్ను, కరెంటు బిల్లులు కడుతూ మహబూబ్ నగర్ పట్టణంలో నివాసముంటున్న పేద వికలాంగుల ఇళ్లను ఎలాంటి నోటీసులు లేకుండా అర్థరాత్రి నేలమట్టం చేశారు. pic.twitter.com/JlkUpyllra
— V Srinivas Goud (@VSrinivasGoud) August 29, 2024
రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు మావి
మా కడుపు మీద కొట్టుడు న్యాయమా..?ఇండ్లు కూల్చివేస్తామని హైడ్రా నోటీసులు ఇవ్వడం పైన ఏడుస్తు ఆవేదన వ్యక్తం చేసిన పేద మహిళ pic.twitter.com/EwbSatTNDj
— Mirror TV (@MirrorTvTelugu) August 30, 2024