సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు, ఏపీకి వెళ్లే నగరవాసుల వాహనాలు బారులు దీరాయి. ఇప్పటికే సెలవులు ప్రకటించడంతో శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కనిపించింది. పండుగ నేపథ్యంలో శుక్రవారం రాత్రి వరకు 50 వేల వాహనాలు వెళ్లనున్నట్టు జీఎంఆర్ అధికారులు అంచనా వేస్తున్నారు.
– హైదరాబాద్/చౌటుప్పల్