హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వాహనాల పెండింగ్ చలాన్లపై ప్రకటించిన రాయితీలు బుధవారం నుంచి జనవరి 10వరకు అమలు కానున్నాయి. ఈ మేరకు రవాణా శాఖ కార్యదర్శి కే శ్రీనివాసరాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
బైక్లు, ఆటోలకు 80 శాతం, ఫోర్ వీలర్లకు 60 శాతం, ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90 శాతం, భారీ వాహనాలపై 50 శాతం రాయితీని ప్రకటించారు. రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్లో ఉండటంతో పోలీసుశాఖ ఈ నిర్ణయం తీసుకొన్నది. నిరుడు రాయితీ ప్రకటనతో 45 రోజుల్లోనే ఏకంగా 300 కోట్ల ఆదాయం సమకూరింది.