హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం చార్జ్షీట్ దాఖలు చేసింది. లష్కరే ఇ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు నిందితులపై ఈ చార్జీషీట్ దాఖలైంది. వాజిద్, సమీ, హసన్పై 2022 సెప్టెంబర్ 28న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఘోరీ ఆదేశాల మేరకు నిందితులు పేలుళ్లకు కుట్ర చేసినట్టు చార్జ్షీట్లో ఎన్ఐఏ పేర్కొన్నది. ఆన్లైన్ చేరికల ద్వారా సమి, హసన్ను ఉగ్రవాద సంస్థ వైపు చేర్చుకున్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది.
వీరి నుంచి నాలుగు హ్యాండ్ మేడ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. హవాలా రూపంలో డబ్బు చేతులు మారినట్లు గుర్తించినట్టు పేర్కొన్నది. జహీద్ ద్వారా పేలుడు పదార్థాలను సమీ, హసన్ పొందారని, వాటితో నగరంలో దసరా రోజు పేలుళ్లకు ప్రణాళిక రచించారని పేర్కొన్నది. ముగ్గురు నిందితులపై ఐపీసీ 120 బీ, 153 ఏ పేలుడు పదార్థాల చట్టం 4,5,6,13,17,18,18బీ, 20 కింద ఎన్ఐఏ చార్జ్షీట్ దాఖలు చేసింది.