హైదరాబాద్: మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయానికి హైదరాబాద్కు చెందిన భక్తుడు పెద్దమొత్తంలో బంగారాన్ని సమర్పించుకున్నారు. నగరానికి చెందిన పార్దసారథి రెడ్డి అనే భక్తుడు షిర్డీ సాయినాథునికి రూ.2 కోట్ల విలువైన నాలుగు కిలోల బంగారాన్ని బహూకరించారు. బుధవారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ పూజారులకు అందజేశారు.