హైదరాబాద్, డిసెంబర్ 9: హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 12 నుంచి 14 వరకు టై గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నట్లు నిర్వహకులు తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయెన్, గ్రీన్కో గ్రూపు ఎండీ, సీఈవో అనిల్ కుమార్లతోపాటు 2,500 మంది డెలిగేట్స్, 550కి పైగా టై చార్టర్ సభ్యులు హాజరుకానున్నారు. వీరితోపాటు 17 దేశాలకు చెందిన 150 అంతర్జాతీయ స్పీకర్లు, 200కి పైగా పెట్టుబడిదారులు కూడా పాల్గొననున్నారు. ఏడోసారి జరుగుతున్న ఈ గ్లోబల్ సమ్మిట్లో ప్రపంచ వ్యవస్థాపక అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నట్లు టై గ్లోబల్ వైస్ చైర్మన్ మురళీ చెప్పారు.