అమీర్పేట్, సెప్టెంబర్ 21: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ సంయుక్త భాగస్వామ్యంతో దసరా షాపింగ్ బొనాంజా ప్రారంభమైంది. బుధవారం ఉదయం అమీర్పేటలోని కేఎల్ఎం ఫ్యాషన్ మాల్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఎడిటర్లు తిగుళ్ల కృష్ణమూర్తి, శ్రీనివాస్రెడ్డిలతో పాటు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఆపరేషన్స్ హెడ్ చక్రధర్ కస్టమర్ల సమక్షంలో జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేఎల్ఎం ఫ్యాషన్స్, ఫ్రీడమ్ ఆయిల్, సీఎంఆర్, బిగ్ సీ, కేఫ్ నీలోఫర్ ఎంపిక చేసిన, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రతికలు సూచించిన సంస్థల్లో షాపింగ్ చేసే కస్టమర్లకు బొనాంజా కూపన్లు అందజేస్తారని.. వాటిని అక్కడే ఉన్న బాక్సుల్లో వేయాల్సి ఉంటుందన్నారు. ఈ బొనాంజా పది రోజుల పాటు ( ఈ నెల 21 నుంచి 30 వరకు) కొనసాగుతుందన్నారు.
గత సంవత్సరం కూడా వేలాది మంది కొనుగోలుదారులు, ప్రకటనదారుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగిందని వివరించారు. టైటిల్ స్పాన్సర్లుగా కేఎల్ఎం ఫ్యాషన్స్, ఫ్రీడమ్ ఆయిల్, మెయిన్ స్పాన్సర్లుగా సీఎంఆర్ ఫ్యామిలీ మాల్, బిగ్ సీ, కేఫ్ నీలోఫర్ వ్యవహరిస్తున్న ఈ దసరా బొనాంజాను ఈ సంవత్సరం విజయవంతం చేయాలని కోరారు. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఆపరేషన్స్ హెడ్ చక్రధర్ మాట్లాడుతూ నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే బొనాంజా అమీర్పేట్ కేఎల్ఎంలో ప్రారంభించడం ఆనందగా ఉందన్నారు. తమకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తున్న నమస్తే తెలంగాణకు ధన్యవాదాలు తెలిపారు. కస్టమర్లందరికీ బంపర్ డ్రా అందుబాటులో ఉంటుందని.. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.
ఈ నెల 21 నుంచి 30 వరకు సాగే బొనాంజాలో ప్రతిరోజు ఐదుగురిని విజేతలుగా ప్రకటిస్తారు. ఇందులో మొదటి విజేతకు 32 ఇంచుల టెలివిజన్, రెండో బహుమతిగా మైక్రో ఓవెన్, మూడో బహుమతిగా గిఫ్ట్ ఓచర్, నాల్గో బహుమతిగా ప్రగతి రిసార్ట్ గిఫ్ట్ ఓచర్, ఐదో బహుమతిగా కేఫ్ నీలోఫర్ గిఫ్ట్ హాంపర్ అందివ్వనున్నారు. బంపర్ డ్రాలో విజేతగా నిలిచిన వారికి నిసాన్ మాగ్నెట్ కారును బహూకరిస్తారు.
కేఎల్ఎం ఫ్యాషన్ మాల్లో బుధవారం షాపింగ్ చేసిన బోరబండ అవంతీనగర్కు చెందిన స్వరూప్, సత్య దంపతులు తమ కూపన్లను మొదటగా డ్రాప్ బ్యాక్స్లో వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేఎల్ఎంలో షాపింగ్ చేయడమే మొదటి ప్రాధాన్యమన్నారు. నమస్తే పాఠకులమైన తాము బొనాంజాలో భాగంగా తొలి కూపన్లు డ్రాప్బాక్స్లో చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎడిటర్లు కృష్ణమూర్తి, శ్రీనివాస్రెడ్డిలు దంపతులను అభినందించారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే భాగస్వామ్యంతో దసరా షాపింగ్ బొనాంజాను విజయవంతంగా కొనసాగిస్తున్నామని కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రకటనల విభాగం హెడ్ సునీల్ పేర్కొన్నారు. ఈ బొనాంజాలో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కస్టమర్లకు బహుమతులు రావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఎడిటర్లు కృష్ణమూర్తి, శ్రీనివాస్రెడ్డిలకు ఫ్యాషన్ మాల్లోని డిజైన్లను చూపించారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఏజీఎంలు రాములు, రాజిరెడ్డి, రామకృష్ణ యాదవ్, డిప్యూటీ మేనేజర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.