హైదరాబాద్ : సినీ హీరో సిద్ధార్థ్పై హైదరాబాద్లో కేసు నమోదైంది. సామాజికవేత్త ప్రేరణ సిద్ధార్థ్పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షట్లర్ సైనా నెహ్వాల్పై సిద్ధార్థ్ అభ్యంతరకరమైన ట్వీట్ చేశారని ప్రేరణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో సిద్ధార్థ్పై ఐపీసీ 509 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిద్ధార్థ్పై రెండు ఫిర్యాదులు అందగా, ఒక ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు.
ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్పై నటుడు సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనపై సైనా ఈనెల 5న ట్విట్టర్లో స్పందిస్తూ ‘ప్రధాని భద్రతలో రాజీపడిన పరిస్థితి ఎదురైతే, ఏ దేశమైనా సురక్షితంగా ఉంటుందని ఎలా అనుకోగలం’ అని అన్నారు. దీన్ని సిద్ధార్థ్ రీట్వీట్ చేస్తూ.. ‘చిన్న కాక్ ప్రపంచ విజేతా.. దేవుని దయ వల్ల దేశాన్ని కాపాడేవారు ఉన్నారు’ అని పేర్కొన్నారు.
సిద్దార్థ్ ట్వీట్పై సైనా స్పందించారు. ఇది సరైనది కాదని, ఆయన తన అభిప్రాయాన్ని ఇంతకంటే మంచి పదాలతో వ్యక్తపరచవచ్చునని పేర్కొన్నారు. కాగా, వివాదంపై సిద్దార్ధ్ సోమవారం వివరణ ఇచ్చారు. తనకు ఎవరినీ అవమానపరిచే ఉద్దేశం లేదని, తన వ్యాఖ్యలను మరోలా అర్థం చేసుకున్నారని అన్నారు.