దంతాలపల్లి, అక్టోబర్ 15: అవిభక్త కవలలు వీణా-వాణీ ఆదివారం 20వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. 2003 అక్టోబర్ 16న సూర్యాపేటలోని ఓ ప్రైవేటు దవాఖానలో జన్మించిన వీరికి పుట్టుకతోనే తలలు అతుక్కొని ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడేనికి చెందిన మారగాని మురళి-నాగలక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు. రెండో సంతానంలో వీణా-వాణీలు జన్మించారు. వీరి శస్త్రచికిత్స కోసం 2003 నుంచి వివిధ దేశాలు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం వీరు హైదరాబాద్లోని అమీర్పేట మైత్రీవనం లోని చిల్డ్రన్ హోంలో ఉంటూ చదువుకుంటున్నారు.