హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఆర్టీపీసీఆర్ కన్నా వేగంగా, తక్కువ ఖర్చులో, ఒమిక్రాన్ సహా అన్నిరకాల వేరియంట్లను గుర్తించే టెస్టింగ్ కిట్ను బయోజెనెక్స్ సంస్థ ఆవిష్కరించింది. హైదరాబాద్కు చెందిన ఈ సంస్థ అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ‘కొవిడ్-19 ట్రిప్లెక్స్ ఆర్టీపీసీఆర్ డైరెక్ట్’ పేరుతో శుక్రవారం టెస్టింగ్ కిట్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కిట్ దాదాపు వంద శాతం కచ్చితత్వంతో పనిచేస్తుందని సంస్థ సీఈవో డాక్టర్ కృష్ణకాల్రా వెల్లడించారు. 110 నిమిషాల్లోనే ఫలితం వస్తుందన్నారు. నోయిడాలోని ఐసీఎంఆర్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ ల్యాబ్ ఈ కిట్ పనితీరును సమగ్రంగా పరిశీలించిందని చెప్పారు. కిట్ ధర రూ.
150 అని చెప్పారు.