హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన దావాలో బీజేపీకి చెందిన ఢిల్లీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా కవితకు వ్యతిరేకంగా మీడియా, సోషల్ మీడియాల్లో ఏ విధమైన వ్యాఖ్యలూ చేయరాదని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ పర్వేశ్వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్సాలకు నోటీసులు జారీచేసింది. లిక్కర్ సాంను కవితకు ముడిపెడుతూ ఏ విధమైన వ్యాఖ్యలూ చేయరాదని ఆదేశించింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని వారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేస్తూ బుధవారం సిటీ సివిల్ కోర్టు జడ్జి జీ సునీతా రవీంద్రారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తనపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని.. దీని గురించి పత్రికలు, టీవీల్లో తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలు వచ్చాయని పేర్కొంటూ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ సిటీ సివిల్కోర్టు 9వ చీఫ్ జడ్జి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు.
ప్రతివాదులుగా బీజేపీకి చెందిన ఢిల్లీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్సాలను చేర్చారు. ప్రజాజీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగేలా ప్రతివాదులైన బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని, ఇకపై ఇలాంటి ఆరోపణలు చేయకుండా కట్టడి చేయాలని కవిత తన పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరారు. ఎమ్మెల్సీ కవిత తరఫున న్యాయవాది మోహిత్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల తర్వాత సిటీ సివిల్కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇకపై ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా లికర్ సాంకు సంబంధించి ఏవిధమైన ఆరోపణలు, వ్యాఖ్యలు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది.
సెర్ప్ ఉద్యోగ జేఏసీ సంఘీభావం
ఎమ్మెల్సీ కవితపై నిరాధార ఆరోపణలు చే యడం, ఆమె నివాసంపై భౌతిక దాడులకు దిగడంపై సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఎమ్మెల్సీ కవితను కలిసి రాష్ట్ర సెర్ప్ జేఏసీ ఆధ్వర్యంలో చేసిన సంఘీభావ తీర్మానం లేఖను అందజేశారు.