హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ చికిత్సలో హైదరాబాద్ భేష్ అని ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ప్రశంసించారు. నగరంలో క్యాన్సర్ వ్యాధులకు సంబంధించి అత్యాధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన డాక్టర్ వీఎన్ శిరోద్కర్ 10వ స్మారక ఉపన్యాసంలో భాగంగా ‘క్యాన్సర్ మేనేజ్మెంట్లో మనం ఎక్కడ’ అనే అంశంపై డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ప్రసంగించారు. మన దేశలో ఈ ఏడాది 12 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, వచ్చే ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. క్యాన్సర్ను సమర్థంగా ఎదుర్కొంనేందుకు టార్గెటెడ్ థెరపీ, ప్రొటాన్ థెరపీ, ఇమ్యూన్ థెరపీలాంటి అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.