హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం మెడికల్ వ్యాల్యూ టూరిజం డెస్టినేషన్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆరోగ్యశాఖ మంత్రి అంబర్ జడ్ సండర్సన్తో మంత్రి దామోదర భేటీ అయ్యారు. రాష్ట్రంలో మెడికల్, పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై పరస్పరం చర్చించుకున్నారు. అనంతరం మంత్రి దామోదర మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏటా 8,515 మంది మెడికల్ గ్రాడ్యుయేట్స్, 6,880 మంది నర్సింగ్ గ్రాడ్యుయేట్స్, 22,970 మంది పారామెడికల్ కోర్సులు పూర్తి చేస్తున్నారని చెప్పారు. నర్సింగ్, పారామెడికల్ కోర్సులు పూర్తి చేసినవారికి తెలంగాణ ప్రభుత్వం టాంకాం (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్) ద్వారా మరింత శిక్షణ ఇచ్చి ప్రపంచంలో ఎకడైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, టాంకాం సీఈవో విష్ణువర్ధన్రెడ్డి, ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, ఐఐహెచ్ఎఫ్ డైరెక్టర్ హైమావతి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో విశాలాక్షి, వెస్ట్రన్ ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టేసీ హార్న్, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ జోడి సౌత్ తదితరులు పాల్గొన్నారు.