హైదరాబాద్ : ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో 11 హై-రిస్క్ దేశాల ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ అరైవల్ హాల్ ప్రీ ఇమ్మిగ్రేషన్లో ప్రత్యేక కొవిడ్ -19 టెస్టింగ్ బూత్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్ని అరైవల్ గేట్ల వద్ద థర్మల్ స్కానర్లో ఏర్పాటు చేశారు. ప్రతి ప్రయాణికుడు థర్మల్ స్ర్కీనింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇక ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, టెర్మనల్లో ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టుల ఏర్పాట్ల గురించి పోస్టర్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ టెస్టుల కోసం బుకింగ్ ప్రక్రియను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులు రాకకు ముందే తమ బుకింగ్ను బుక్ చేసుకోవచ్చు. తదితర వివరాల కోసం www. hyderabad.aero, http:// covid.mapmygenome.in వెబ్సైట్లను లాగిన్ అవొచ్చు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం రూ. 750, ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ కోసం రూ. 3,900 చెల్లించాల్సి ఉంటుంది.